‘సౌత్’ఇండియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్!

  • August 31, 2016 / 08:28 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ జనతా గర్జన మొదలయింది. రేపు ఈ పాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ర్యాలీలు, హంగామాతో ధూమ్..ధామ్ చెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది…ఇదిలా ఉంటే టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలా మంది హీరోలు మన ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం అయ్యారు…తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’సినిమా తమిళంలో ‘సెల్వందన్’ పేరుతో కాస్త మంచి పేరు సంపాదించుకుని, ప్రిన్స్ కి తమిళ మార్కెట్ రుచి చూపించింది. ఇక అదే క్రమంలో మన స్టైలిష్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మలయాళంలో మన వాడు సూపర్ హీరో అనే చెప్పాలి, తాజాగా విడుదలయిన సరైనోడు సినిమా సైతం అక్కడ సూపర్ హిట్ అయ్యి అల్లు అర్జున్ కి మరింత క్రేజ్ పెంచేసింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ తెలుగు సినిమాలకే, టాలీవుడ్ మార్కెట్ పైనే ఫోకస్ చేసిన ఎన్టీఆర్, తాజాగా సౌత్ ఇండియా అంతటా టార్గెట్ చేసినట్లు సమాచారం.

మన పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకలో ఎలాగో మన తెలుగు హీరోలకు మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ ఎన్టీఆర్ క్రేజ్ కు ఢోకా లేదు, ఇక ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నాడు కాబట్టి మలయాళంలో ఎన్టీఆర్ కి మార్కెట్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిందల్లా మన తమిళ నాడు…అక్కడ సైతం పాగా వేసేందుకు ఎన్టీఆర్ స్కెచ్ వేశాడు…పైగా…కొరటాల శివ, దేవి శ్రీప్రసాద్, సమంత, నిత్యామీనన్ వీళ్లంతా తమిళ తంబీలకు చాలా సుపరిచితం కావడంతో, ఎన్టీఆర్ అక్కడ తన మార్కెట్ ను పెంచుకునే దిశగా పావులు కదుపుతున్నాడు…ఏకంగా…ఈ సినిమా అక్కడ 100 స్క్రీన్స్ లో విడుదల అవుతూ ఉండడం విశేషం…ఇంకా చెప్పాలి అంటే…‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీగా తమిళనాట రిలీజవుతున్న సినిమాగా ‘జనతా గ్యారేజ్’ను చెప్పుకోవాలి. మరి ఈ ఘర్జనని ఎన్టీఆర్ ఎంతవరకూ మార్మోగిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus