మెగా ఫ్యామిలీ కొత్త షూటింగ్‌ ప్లేస్‌ తెలుసా?

  • July 27, 2021 / 12:24 PM IST

టాలీవుడ్‌కు ఓ కొత్త షూటింగ్‌ స్పాట్‌ దొరికింది అంటే… సినిమాలు అక్కడికి వరుస కడుతుంటాయి. అలా మనం చాలా షూటింగ్‌ స్పాట్ల గురించి ఇప్పటివరకు చూసుంటాం. ఆ మధ్య మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అల్లు అర్జున్‌ ‘పుష్ప’ షూటింగ్‌ అయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి ‘ఆచార్య’ టీమ్‌ అక్కడికి వెళ్లింది. ఇప్పుడు ఇదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. బన్నీ గతంలో వెళ్లొచ్చిన షూటింగ్‌ స్పాట్‌కి చిరు అండ్‌ కో వెళ్లబోతున్నారట.

‘అల వైకుంఠపురములో..’ సినిమాలో విలన్‌ కొడుకు పైడితల్లికి తొలి వార్నింగ్‌ ఇచ్చే సీన్‌ గుర్తుందా? బోర్డ్‌ రూమ్‌ సీన్‌ కాకుండా అంతకుముందు ఓ సీన్‌ ఉంటుంది. ఫైట్‌ కూడా ఉంటుంది అక్కడ. ఆఁ.. ఆ పోర్ట్‌ సీన్‌. దానిని కాకినాడ పోర్టులో చిత్రీకరించారట. ఇప్పుడు అదే ప్లేస్‌లో షూటింగ్‌ చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారట. ‘ఆచార్య’లో చిరంజీవి పోర్షన్‌కు సంబంధించి కొన్ని సీన్స్‌ను అక్కడ తీయబోతున్నారట. ‘లూసిఫర్‌’ రీమేక్‌ కోసం కూడా చిరంజీవి మళ్లీ కాకినాడ పోర్టుకు వెళ్తారని వార్తలొస్తున్నాయి.

ఆ సినిమాలో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ అక్కడ చిత్రీకరించే అవకాశం ఉందట. ప్లేస్‌ కొత్తగా ఉండటం, తెలుగు ప్రేక్షకులు ఫ్రెష్‌ ఫీల్‌ రావడం లాంటి కారణాల వల్ల మెగా ఫ్యామిలీ… కాకినాడ పోర్టును ఎంచుకుంటోందని సమాచారం. మరి వీళ్లను చూసి మిగిలిన హీరోలు కూడా అటు వెళ్తారేమో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus