షూటింగ్ కోసం వెళ్ళి వరదల్లో ఇరుక్కున్న స్టార్ హీరో!

  • September 25, 2018 / 12:10 PM IST

“ఖాకీ” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కార్తీ-రాకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే.. గత కొన్ని రోజులుగా ఉత్తారాది రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆ వరదల కారణంగా మనాలీలోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద భీభత్సంలో కార్తీ సినిమా యూనిట్‌ కూడా చిక్కుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులుమనాలిలో జరుగుతుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆల్రెడీ నిర్మాతకు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిలినట్టు తెలుస్తోంది. అయితే.. కార్తీ మరియు కొందరు బృందం ఆల్రెడీ సురక్షితంగా చెన్నై చేరుకొన్నారు. మిగతా యూనిట్ ఇంకా రావాల్సి ఉందని కార్తీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus