బాలయ్య-బోయపాటి సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్

  • December 9, 2019 / 08:28 AM IST

ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అని అడిగితే తెలుగు, తమిళ ప్రేక్షకులు ముక్తకంఠంతో చెప్పే పేరు “కీర్తి సురేష్”. తమిళంలో విజయ్, శివకార్తికేయన్, సూర్య వంటి స్టార్ హీరోలలందరి సరసన కథానాయికగా నటించిన కీర్తిసురేష్.. తెలుగులోనూ నాని, రామ్, పవన్ కళ్యాణ్ ల సరసన నటిస్తూ ఇక్కడ కూడా స్టార్ డమ్ అందుకొంది. ప్రస్తుతం కీర్తి తనకు కావాలంటే తనకు కావాలని యంగ్ హీరోస్ అందరూ క్యూ కడుతున్నారు. యంగ్ హీరోస్ మాత్రమే కాదు.. ఈ క్యూలో సీనియర్ హీరోస్ కూడా బోలెడుమంది ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుగుపుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉండగా ఒక హీరోయిన్ గా కీర్తి సురేశ్ ను కన్సిడర్ చేస్తున్నారట. బోయపాటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ కి కథతో పెద్దగా సంబంధం లేకపోయినా.. మెయిన్ హీరోయిన్ కి మాత్రం మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను యాడ్ చేస్తాడు. అది నచ్చే కీర్తి సురేష్ ఈ సినిమా ఒప్పుకొందని తెలుస్తోంది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus