క్రేజ్ ఉన్నా.. క్యాష్ చేసుకోలేకపోతున్నారే..!

  • May 26, 2020 / 12:31 PM IST

హీరోయిన్ లకు ఒక హిట్టు పడితే.. చాలు ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి. ఎలాగూ వరుస ఆఫర్లు వస్తున్నాయి కదా అని రెమ్యూనరేషన్ కు ఆసపడి ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి త్వరగా వీలైనంత ఎక్కువ సంపాదించుకోవాలి అనుకునే హీరోయిన్లు చాలా మంది ఉంటారు. అందుకోసం ఎంత గ్లామర్ షో చెయ్యాలి.. రొమాంటిక్ సీన్లలో నటించాలి అని దర్శక నిర్మాతలు నిబంధనలు పెట్టినా వెనుకాడరు. ఒకవేళ వారు ఎంచుకున్న సినిమాలు లక్ కొద్దీ హిట్ అయితే.. మరి కాస్త ఎక్కువ కాలం ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉంటారు.

దాదాపు హీరోయిన్ల ఆలోచన ఇలానే ఉంటుందని ఎప్పటి నుండో టాక్ ఉంది. అయితే ఓ ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా నడుచుకుంటున్నారు. వాళ్ళే సై పల్లవి, కీర్తి సురేష్ లు. తెలుగులో ఇద్దరూ చెరో రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. యూత్ లో వీరికున్న క్రేజ్ ను బట్టి చూస్తే ఇవి తక్కువే. వీరిద్దరూ గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉండాలని బలంగా డిసైడ్ అయ్యారట. ఇందుకోసం దర్శక నిర్మాతలు 2కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా వీరు ఒప్పుకోవడం లేదట.

సాయి పల్లవి అయితే కోట్లు ఆఫర్ చేసిన వాణిజ్య ప్రకటనలను సైతం రిజెక్ట్ చేసినట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కీర్తి సురేష్ అయితే ఎక్కువ శాతం హీరోయిన్ ఓరియెంటెడ్ లేదా పెద్ద హీరోల సినిమాలో కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తాను బలంగా చేబుతుందట. తమిళంలో కూడా ఈ ఇద్దరి భామలకు భారీ క్రేజ్ ఉంది. అయినా వీరు క్యాష్ చేసుకోవాలి అని చూడటం లేదు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus