‘సావిత్రి’ లా మారిన కీర్తి సురేష్‌!

  • June 1, 2017 / 08:21 AM IST

టాలీవుడ్ లో కొన్ని పనులు కొందరే చెయ్యాలి, వారు చేస్తేనే ఆ పనులకు అర్ధం, డైలాగ్ చెప్పాలన్నా, ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ పండించాలి అన్నా, రౌద్రాన్ని చూపించాలి అన్న నందమూరి వంశం ఎలాగో, అలాగే బడా హీరోల్లో డ్యాన్స్ తో మ్యాజిక్ చెయ్యాలి అంటే చిరు ఎలాగో, ఆలాగే కొన్ని కొన్ని పాత్రలు చెయ్యాలి అంటే కొందరికే ఆ అవకాశం దక్కుతుంది, అదే క్రమంలో ఆది వారికే సెట్ అవుతుంది. విషయం ఏంటి అంటే, అలనాటి మహానటి సావిత్రి గుర్తు ఉందిగా, తెలుగుతెరపై, బ్ల్యాక్ అండ్ వైట్ రోజుల్లోనే అందాన్ని ఆవిష్కరించిన అభినయ మందార మాల. అయితే ఆవిడ జీవిత గాధ ఆధారంగా ఆమె కధను తెలుగు తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ విషయల్లోకి వెళితే, ‘మహానటి’ అన్న టైటిల్ తో అలనాటి మహానటి సావిత్రి కధను తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్, మన అశ్వీనీదత్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ మహానటి పాత్రకు మన అందాల భామ కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్‌ లొకేషన్‌కు అచ్చం సావిత్రిలాగానే తయారై వచ్చారు కీర్తి సురేష్‌. రెండు జడలతో ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రిలా కనిపిస్తున్నారు కీర్తి సురేష్‌. అసలైతే ఈ పాత్రకు ముందు చాలా మందినే అనుకున్నారు, నిత్యామీనన్‌, విద్యా బాలన్‌ ఇలా కానీ, అనుకోని కారణాల వల్ల వారెవరు ఈ పాత్ర చెయ్యలేదు, అయితే యాదృఛ్ఛికమో, లేక కాకతాళీయమో తెలీదు కానీ, ఈ పాత్రలో కీర్తి సురేష్‌ సూపర్ గా యాప్ట్ అయ్యారు. అందరినీ అడిగి చివరకు కీర్తి సురేష్ ని ఎంచుకున్న నాగ్ అశ్విన్ తన నిర్ణయం ఎంత కరెక్ట్ అయిందో అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడట. అదీ అన్న మాట మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus