కీర్తి సినిమాపై మినిమమ్ హైప్ లేదు!

  • November 3, 2020 / 05:58 PM IST

ఎంత సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నా… వాటి గురించి కొంత డిస్కషన్ అయినా ఉంటుంది. కానీ కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సినిమా విషయంలో అలాంటి బజ్ కనిపించడం లేదు. ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ చాలా మంది ప్రేక్షకులకు ఈ విషయం కూడా తెలియదంటే ప్రమోషన్ ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనికంటే ముందు కీర్తి నటించిన ‘పెంగ్విన్’ సినిమా ప్రైమ్ లో రిలీజయింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కీర్తి నటించిన ‘గుడ్ లక్ సఖీ’ సినిమా కూడా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

కానీ ‘మిస్ ఇండియా’ విషయంలో యూనిట్ చాలా సైలెంట్ గా ఉంది. వారం క్రితం సడెన్ గా ట్రైలర్ రిలీజ్ చేసి.. అందులోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫామ్ పై నవంబర్ 4న సినిమా రిలీజ్ కానుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుండే ఈ సినిమా ప్రసారం కానుంది. కానీ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ లేదు. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. వర్చువల్ ప్రీరిలీజ్ ఈవెంట్, ఫ్యాన్స్ మీట్ ఇలా చాలానే చేస్తున్నారు. కానీ ‘మిస్ ఇండియా’ మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంది.

పైగా బుధవారం నాడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సినిమాల పరిస్థితి ఇలానే ఉంటోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ , ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాల విషయంలో ఇలానే జరిగింది. పబ్లిసిటీ లేకపోయినా ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సెంటిమెంట్ ‘మిస్ ఇండియా’ విషయంలో కూడా ఫాలో అవుతున్నారో లేక కావాలనే ప్రమోషన్స్ చేయడం లేదో తెలియడం లేదు!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus