డిజిటల్ రిలీజులకు క్యూ కడుతున్న కీర్తి సినిమాలు

  • July 7, 2020 / 08:00 AM IST

సత్యదేవ్ నటించిన సినిమాలన్నీ ఇప్పుడు ఒటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతుండడంతో అతడ్నిప్పుడు “తెలుగు రాధిక ఆప్టే” అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఆ టైటిల్ కోసం పోటీపడుతోంది కీర్తిసురేష్. ఆమె నటించిన సినిమా “పెంగ్విన్” ఇటీవల అమేజాన్ ప్రైమ్ లో విడుదలై ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయకపోయినా సౌత్ నుంచి ఒటీటీ రిలీజులకు దారి చూపించింది. ఇప్పుడు ఆమె నటించిన మరిన్ని సినిమాలు ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

కీర్తిసురేష్ తదుపరి చిత్రాలైన మిస్ ఇండియా, గుడ్ లక్ చిత్రాలు ఒటీటీ రిలీజ్ కి బేరాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ రేట్ ఫిక్స్ అయితే కీర్తిసురేష్ ఒటీటీ స్టార్ గా మారిపోవడం ఖాయం. ఇకపోతే.. కీర్తిసురేష్ ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా సైన్ చేసి ఆ సినిమా కోసం కాస్త లావెక్కుతోంది. పాపం “మహానటి” అనంతరం సన్నబడడం కోసం చేసిన ప్రయత్నాలు వికటించి మరీ సన్నగా అయిపోయింది కీర్తి. “పెంగ్విన్”లో ఆమె లుక్ కు చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

దాంతో మహేశ్ మూవీ కోసం మళ్ళీ బ్యాక్ టు షేప్ కి వచ్చే పనిలో పడింది కీర్తి. సొ మహేశ్ మూవీ మొదలయ్యేవరకూ కీర్తి సినిమాలన్నీ ఒటీటీలో అలరించనున్నాయన్నమాట. మరో విషయం ఏమిటంటే.. కీర్తిసురేష్ త్వరలోనే ప్రభాస్ తో జత కట్టనుందని సమాచారం.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus