ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేస్తున్న పెద్ద సినిమాలు..!

  • July 30, 2019 / 01:47 PM IST

‘బాహుబలి2’ తరువాత ఓ సౌత్ సినిమా అన్ని భాషల్లో విజయం సాధించిందంటే అది ‘కె.జి.ఎఫ్’ సినిమా మాత్రమే. ఆ చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యశ్ ను చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ కూడా రాజమౌళి టేకింగ్ కు దగ్గరగా ఉందని ప్రేక్షకులు కితాబిచ్చారు. కానీ ఈసారి ప్రశాంత్ నీల్ ఏకంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికే చెక్ పెట్టేలా కనిపిస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే ఇప్పుడు రాజమౌళి చరణ్,ఎన్టీఆర్ లతో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

ఇక ప్రశాంత్ నీల్ కూడా ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ‘హోంబలే ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నిర్మితమవుతుంది. తాజాగా ఈ చిత్రం నుండీ ‘అధీరా’ లుక్ ను రిలీజ్ చేశారు. అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. కాబట్టి బాలీవుడ్ లో ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక టాలీవుడ్ లో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని జూలై 30 న విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ‘కె.జి.ఎఫ్’ చిత్రం 2020 ఏప్రిల్ లేదా మే నెల లోపు విడుదల అయితే ఎలాంటి సమస్య ఉండదు. అయితే షూటింగ్ లెటయ్యి.. జూలై వరకూ వచ్చిందంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కి కూడా ఇబ్బందులు తప్పవు. ‘రాజమౌళి సినిమా పక్కన మరో చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు’ అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నా.. పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఈ చిత్ర నిర్మాతలకి మాత్రం.. కాస్త ఇబ్బందులు తప్పవు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus