ఖుషీ కపూర్ కూడా సినిమాలే ముద్దంటోంది!

  • July 26, 2018 / 11:39 AM IST

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ఇటీవల “ధడక్‌” చిత్రంతో కథానాయికగా విమర్శకులను, విశ్లేషకులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. తల్లి శ్రీదేవి వలె జాన్వీ కూడా కళ్లతోనే హావభావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా కితాబివ్వడంతో ఆమె కుటుంబ సభ్యులందరూ ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఇప్పుడు వీరి ఆనందం రెండింతలు కానుంది. ఎందుకంటే.. త్వరలోనే శ్రీదేవి రెండో కూతురు, జాన్వికపూర్ చెల్లెలు అయిన ఖుషీ కపూర్ కూడా వెండితెర తెరంగేట్రం చేయనుంది.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్‌ తెలిపారు. “ఖుషీ మొదట మోడల్‌ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్‌ కావాలనుకుంటోంది. కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్‌, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని” బోనీ కపూర్‌ వ్యాఖ్యానించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus