Kiara Advani: కియారా అన్ని కోట్లు డిమాండ్ చేస్తోందా..?

  • May 12, 2021 / 02:21 PM IST

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చాలామంది హీరోయిన్లు ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే. క్రేజ్ ఉన్నప్పుడే ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది హీరోయిన్లు డిమాండ్ ను మించి రెమ్యునరేషన్ కావాలని నిర్మాతలను అడుగుతుండటం గమనార్హం. కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించగా ఆ రెండు సినిమాల్లో భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ అయితే వినయ విధేయ రామ డిజాస్టర్ గా నిలిచింది.

దాదాపు రెండేళ్ళ నుంచి కియారా తెలుగు సినిమాల్లో నటించకపోవడంతో ప్రేక్షకుల్లో చాలామంది ఆమెను మరిచిపోయారు. అయితే కియారా అద్వానీని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకుంటే ఆ సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ చరణ్ కాంబినేషన్ సినిమాతో పాటు ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం దర్శకనిర్మాతలు కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కియారా ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారని సమాచారం.

కియారా అద్వానీ డిమాండ్ చేస్తున్న పారితోషికం వరుసగా హిట్లు అందుకుంటున్న రష్మిక పారితోషికం కంటే ఎక్కువ కావడం గమనార్హం. బాలీవుడ్ లో చేతినిండా ఆఫర్లు ఉండటంతో కియారా ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చి కియారాను తమ సినిమాల్లో తీసుకోవడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus