Kiara Advani: స్పెషల్‌ డే నాడు ఎమోషనల్‌ అయిన కియారా… ఏం చెప్పిందంటే?

  • June 16, 2023 / 06:59 PM IST

తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. తరచుగా నటించకపోయినా.. టాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది కియారా అడ్వాణి. కారణం ఆమె చేసిన సినిమాలు, ఆ సినిమాల హీరోలే. మహేష్‌బాబు సినిమాతో తెలుగులో కెరీర్‌ ప్రారంభించింది మరి. ఆ వెంటనే రామ్‌చరణ్‌ సినిమాలో నటించింది. ‘వసుమతి’గా ‘భరత్‌ అనే నేను’లో నటించిన కియారా నటిగా మారి 9 ఏళ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో తన గురించి, తన కెరీర్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది.

ఆలియా అడ్వాణీ… (Kiara Advani) కియారా అడ్వాణీగా మారి 9 ఏళ్లు అయ్యింద. 2014లో ‘ఫగ్లీ’ అనే బాలీవుడ్‌ సినిమాతో ఆమె కెరీర్‌ ప్రారంభమైంది. ఆ సినిమా మూడేళ్లపాటు పెద్దగా సినిమాలు లేకపోయినా.. 2018 నుండి జోరు పెంచింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో సినిమాలు చేసుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఈ సందర్భంగా ఓ లేఖను అభిమానులతో పంచుకుంది. ‘‘నా ప్రియమైన శ్రేయోభిలాషులకు, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ ప్రేమను నాకు ఈ తొమ్మిదేళ్లు పంచినందుకు సంతోషంగా ఉంది. మీ జీవితంలో, మీ కుటుంబంలో నేను ఒక భాగం కావడం ఆనందంగా ఉంది’’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ‘‘నా కష్టసుఖాలలో తోడుగా ఉండి, నేను నటిగా ఎదగడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్యూ. మీ అందరి ఆదరాభిమానాలతో నటిగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నాను. కానీ ఇప్పుడే మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టినట్లుగా అనిపిస్తోంది.

మీ అందరినీ మరింత అలరించడానికి నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. నటన పరంగా ఇంకా నేర్చుకొని గొప్ప స్థాయికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాను’’ అని లేఖలో రాసుకొచ్చింది కియారా. కియారా అడ్వాణీ ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్‌ – శంకర్‌ల ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోంది. అది కాకుండా కార్తీక్‌ ఆర్యన్‌తో ‘సత్యప్రేమ్‌ కీ కథ’ అనే సినిమా కూడా చేస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus