హాట్ టాపిక్ గా మారిన హీరో కామెంట్స్!

  • November 19, 2021 / 05:57 PM IST

తనను కావాలనే కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తమిళ హీరో శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. దర్శకుడు వెంకటేష్ ప్రభు రూపొందించిన ‘మానాడు’ సినిమాలో హీరోగా నటించారు శింబు. ఈ సినిమా నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు హీరో శింబు. ఓ ప్రెస్ మీట్ సినిమా సంగతులను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. వెంకట్ ప్రభుతో కలిసి సినిమా చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నానని.. కొన్ని కారణాల వలన కుదరలేదని అన్నారు.

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని.. ఇందులో ఎస్ జే సూర్య పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పారు. అప్పటివరకు సరదాగా మాట్లాడిన శింబు కన్నీళ్లు పెట్టుకుంటూ.. తనను కొందరు టార్గెట్ చేశారని.. కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. శింబు ఏడవడంతో అక్కడున్న సినిమా సభ్యులు ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపటికి తేరుకొని శింబు ఆ సమస్యల సంగతి తాను చూసుకుంటానని.. తన సంగతిని మాత్రం మీరు(అభిమానులు) చూసుకోవాలని కోరారు.

శింబు కన్నీళ్లు పెట్టుకోవడంతో వేదికపై ఉన్న భారతీరాజా, ఎస్ఏ చంద్రశేఖర్, ఎస్‌జే సూర్య, నిర్మాత కె.రాజన్ తదితరులు ఆయన్ను ఓదార్చారు. అయితే తనను ఎవరు ఇబ్బంది పెడుతున్నారనేది మాత్రం శింబు చెప్పలేదు. తొలిసారి ఆయన ఇలా కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus