మిర్చి టీమ్ కి కృతజ్ఞతలు తెలిపిన కొరటాల శివ

  • February 9, 2018 / 06:44 AM IST

కొరటాల శివ దర్శకుడిగా మారకముందు అనేక హిట్ సినిమాలకు కథలను, మాటలను అందించారు. అందుకు కొందరు డబ్బులు ఇచ్చారు.. మరికొందరు పేరు ఇచ్చారు. ఉత్తి చేయి చూపించినవారు కూడా ఉన్నారు. ఆ కసితోనే కొరటాల శివ మెగా ఫోన్ పట్టుకున్నారు. అయితే దర్శకుడిగా అవకాశం ఇచ్చింది మాత్రం ప్రభాస్. అందుకే అతనికి ఎప్పటికి రుణపడి ఉంటానని పలు సందర్భాల్లో చెప్పారు. ఇద్దరి కలయికలో తెరకెక్కిన మిర్చి 2013 ఫిబ్రవరి 8 రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం రిలీజ్ అయి ఐదేళ్లు అయిన సందర్భంగా డైరక్టర్ ఆనాటి సంగతులను ఓ సారి గుర్తుచేసుకున్నారు. “మిర్చి సినిమా చాలా జ్ఞాపకాల్ని మిగిల్చింది.

నాతో సినిమా చేసే ధైర్యం చూపిన ప్రభాస్ కు, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ కు, సినిమాటోగ్రాఫర్ మధికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు కృతజ్ఞతలు” అని సోషల్ మీడియా వేదికపై థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus