Vijay, Samantha: విజయ్, సమంతల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా?

  • November 9, 2022 / 12:43 AM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత హీరోహీరోయిన్లుగా ప్రముఖ టాలీవుడ్ బ్యానర్లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఖుషి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండటంతో ఖుషి మూవీ షూటింగ్ వాయిదా పడుతోంది. ఖుషి మూవీ ఆడియో హక్కులు ఏకంగా 13 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ప్రముఖ ఆడియో సంస్థలలో ఒకటైన సరిగమ సంస్థ ఈ సినిమా ఆడియో హక్కులను కొనుగోలు చేసింది. ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు కాగా ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు అబ్దుల్ వాహెద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మలయాళంలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున అబ్దుల్ వాహెద్ ఖుషి సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గర కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పాటలు రిలీజ్ కాకుండానే ఖుషి మూవీ ఆడియో రైట్స్ ఊహించని రేటుకు అమ్ముడై అందరికీ షాకివ్వడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సమంత అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. సమంత ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

ఖుషి సినిమా సమంత రేంజ్ ను మరింత పెంచే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత నటించిన సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఖుషి ఆడియో హక్కులు భారీ రేటుకు అమ్ముడవడంతో విజయ్, సమంతల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus