Lavanya Tripathi: కేఫ్ మొదలుపెడుతోన్న లావణ్య!

  • June 26, 2021 / 11:02 AM IST

”అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభంలో రెండు, మూడు హిట్లు అందుకున్నప్పటికీ ఆ తరువాత మాత్రం ఒక్క హిట్టు కూడా రాలేదు. రీసెంట్ గా ఆమె నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉండగా.. లావణ్య ఇప్పుడొక కొత్త బిజినెస్ మొదలుపెట్టాలని నిర్ణయించుకుందట. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సొంత వ్యాపారాలు పెట్టేశారు. తమన్నా, సమంత, కాజల్ ఇలా ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా బిజినెస్ లో తన లక్ పరీక్షించుకోవాలని చూస్తుంది. తన సొంతూరు డెహ్రాడూన్ లో ఎకో ఫ్రెండ్లీ కేఫ్ ను స్టార్ట్ చేయబోతుంది. డెహ్రాడూన్ కి దగ్గర్లో చమసారి అనే విలేజ్ లో కొంత స్థలాన్ని కొనుక్కుంది లావణ్య.

మొదట ఈ ప్లేస్ లో గెస్ట్ హౌస్ నిర్మించాలని అనుకుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఓ కేఫ్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అందంగా, ఎకో ఫ్రెండ్లీ కేఫ్ ని నిర్మించబోతుంది. ప్రస్తుతం లావణ్య డెహ్రాడూన్ లోనే ఉంటుంది. మరి తన కేఫ్ ను ఎప్పుడు మొదలుపెడుతుందో చూడాలి!

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus