Puneeth Rajkumar: అభిమాన హీరోపై అభిమానం చాటుకున్న జంట!

  • November 8, 2021 / 01:08 PM IST

కన్నడ నాట పునీత్‌ రాజ్‌కుమార్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో మనకు తెలిసిందే. ఆయన ఇటీవల కన్నుమూసినప్పుడు ఆ అభిమానం లోతు ఎంతో తెలిసొచ్చింది. తాజాగా పునీత్‌ వీరాభిమానులు అయిన ఓ జంట ఆయన సమాధి ఎదుటే వివాహం చేసుకున్నారు. గంగ, గురు ప్రసాద్ అనే జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పునీత్‌ వీరాభిమానులు… దీంతో ఆయన సమాధి ఎదటే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. శనివారం బళ్లారి నుండి కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ సమాధి వద్దకు వెళ్లారు.

అయితే వివాహానికి పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఆ ఇద్దరూ నిరాశతో ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పునీత్ కుటుంబసభ్యులు వారి కోరిక విషయంలో సానుకూలంగా స్పందించారు. పెళ్లి చేసుకుంటామంటే మాకేమీ ఇబ్బందిలేదని.. కాకపోతే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారా అని అడిగారు. పెద్దలు మా వివాహానికి అంగీకరించారని ఆ ఇద్దరూ తెలిపారు. దీంతో పునీత్‌ కుటుంబసభ్యులు అంగీకరించారు. వెంటనే గంగ, గురుప్రసాద్‌ వివాహబంధంతో ఒక్కటయ్యారు. మా పెళ్లయ్యాక పునీత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాం.

ఈలోగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అందుకే ఆయన సమాధి ఎదుట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాం అని గురుప్రసాద్‌ చెప్పాడు. పునీత్ చేసిన సామాజిక సేవ చూస్తుంటే ఆయన్ను మించిన దేవుడు లేరనిపిస్తుంది. అందుకే ఆయన సమాధిని గుడిగా భావించి పెళ్లి చేసుకున్నామని వధువు గంగ చెప్పారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus