‘పుష్ప’లో విలన్ రోల్ గురించి మాధవన్ క్లారిటీ

  • September 30, 2020 / 01:30 PM IST

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా యాక్ట్ చేసిన ‘సవ్యసాచి’లో మాధవన్ విలన్ రోల్ చేశారు. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ‘నిశ్శబ్దం’లో హీరోగా యాక్ట్ చేశారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో ప్రేక్షకుల ముందుకు మరోసారి మాధవన్ విలన్ గా వస్తారని గుసగుసలు వినిపించాయి. సుకుమార్ డైరెక్షన్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చెయ్యనున్న సినిమా ‘పుష్ప’. ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా ఇది.

యాక్చువల్లీ… ఇందులో విలన్ గా విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేశారు. అతడు కూడా ఓకే అన్నాడు. తమిళంలో హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా షెడ్యూళ్ళతో ‘పుష్ప’ షెడ్యూళ్ళు క్లాష్ కావడంతో సినిమా చెయ్యలేనని సుకుమార్ కి చెప్పాడు. విజయ్ సేతుపతి తప్పుకున్నాక మాధవన్ ని సుక్కు అప్రోచ్ అయ్యారని, విలన్ గా చెయ్యడానికి ఆయన ఓకే అన్నారని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో మాధవన్ క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో నేను విలన్ గా యాక్ట్ చెయ్యనున్నాని వస్తున్న న్యూస్ లో నిజం లేదని మాధవన్ ట్వీట్ చేశారు.ఎవర్ని సుక్కు సెలెక్ట్ చేస్తాడో చూడాలి. ‘నిశ్శబ్దం’ తరవాత ‘రాకెట్రి’తో మాధవన్ తెలుగు ఆడియన్స్ దగ్గరకు రానున్నాడు. ఆ తరవాత కూడా స్ట్రయిట్ సినిమా చేస్తానని అతడు చెప్తున్నాడు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus