అలాంటి వాళ్ళు సంసారం చేస్తారా : మాధవీ లతా

  • May 16, 2020 / 07:19 PM IST

ఈ మధ్య తరచూ ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తుంది నటి మాధవీ లతా. మహేష్ బాబు ‘అతిథి’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర పోషించిన ఈ బ్యూటీ ‘నచ్చావులే’ అనే సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తరువాత నాని హీరోగా వచ్చిన ‘స్నేహితుడా’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. తరువాత కూడా కొన్ని చిన్న సినిమాల్లో నటించింది కానీ.. అవి పెద్దగా ఆడలేదు. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఈమెను పట్టించుకోవడం మానేసారు. ఇక సినీ ఇండస్ట్రీకి దాదాపు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.

‘బి.జె.పి’ ప్రభుత్వంలో చేరిన ఈ బ్యూటీ గతేడాది ఎన్నికల్లో గుంటూరు పరిసర ప్రాంతాల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీకి చాలా వరకూ దూరంగా ఉంటూ వస్తున్న ఈ అమ్మడు ఎందుకో ఇప్పుడు సినిమా వాళ్ళ పై నిప్పులు జల్లే రేంజ్ కామెంట్స్ చేసింది. లాక్ డౌన్ లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న సినీ సెలబ్రిటీల పై ఈమె ఈ కామెంట్స్ చేసింది. అస్సలు ఆగట్లేదుగా జనాలు. మాస్క్ లు వేసుకుని పెళ్ళిళ్ళు ఎందుకు.

ముహూర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘమాసం లేకుంటే మరో వన్ ఇయర్. పిల్ల దొరకదా ..? పిల్లోడు మారిపోతాడా..? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకట.?. మాస్క్‌ ముసుగులో పెళ్ళి అవసరమా..? కొన్నాళ్ళు ఆగలేని సంసారాలు చేస్తారా.?ఫిక్స్‌ అయిన మ్యారేజెస్.. గ్యాప్ వస్తే నిజాలు తెలిసే బంపర్‌ ఆఫర్ మిస్‌ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్ళి ఏందో..? అంటూ కామెంట్స్ చెయ్యడంతో పాటు డిస్‌ క్లైమర్‌ : `నా పోస్ట్ నా ఇష్టం.. నా ఒపీనియన్ నా ఇష్టం. నాకు నా ఫీలింగ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ చేసే హక్కు ఉంది` అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా పెట్టింది.


Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus