వినాయకచవితి రోజు కూడా షూటింగ్ లోనే మహర్షి టీమ్!

  • September 12, 2018 / 06:17 AM IST

ఇతర రంగాలకు.. సినిమా రంగానికి కొన్ని తేడాలుంటాయి. ఈరోజు వర్క్ రేపు చేసుకోవచ్చు అనేదానికి వీలు లేదు. ఈరోజు మిస్ అయితే ఒక ఆర్టిస్ట్ డేట్ దొరకాలంటే ఏడాది పట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. అందుకే దర్శకుడు, నిర్మాత చాలా అలర్ట్ గా ఉండాలి. షెడ్యూల్ వేయడంలో కాస్త అటు ఇటు అయినా భారీ నష్టాన్ని చూడాల్సి ఉంటుంది. అందుకే వంశీ పైడి పల్లి తన సినిమాని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్  డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అదే ఉత్సాహంతో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. మూడో షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు.

దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ ల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అక్కడికి వెళ్లాలంటే ఇక్కడ షూట్ చేయాల్సిన సన్నివేశాలను కంప్లీట్ చేయాలి. అందుకే రేపు వినాయక చవితి అయినప్పటికీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వలేదు. అందరూ షూటింగ్ కి హాజరుకావాలని డైరక్టర్ ఆర్డర్ వేసినట్టు తెలిసింది. వృత్తే దైవంగా భావించి చిత్ర యూనిట్ అందరూ రేపు పనిలోనే నిమగ్నం కానున్నారు. అల్లరి నరేష్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రం రైతుల కష్టాలపై సాగుతుందని సమాచారం. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ కెరీర్ లో నిలిపోయే విధంగా వంశీ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus