మహేష్ మహర్షి సినిమా గురించి బయటికి వచ్చిన ఆసక్తికర అంశాలు ఇవే

  • November 1, 2018 / 10:26 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అదే ఉత్సాహంతో రెండో షెడ్యూల్ ని గోవాలో కంప్లీట్ చేశారు. తాజాగా మూడో షెడ్యూల్ అమెరికాలో కంప్లీట్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్లో పూజా హెగ్డే పాల్గొనలేదని, ఆమెతో మహేష్ కి కాంబినేషన్ సీన్లు లేవని మేకింగ్ ఫోటోలని బట్టి సినీ విశ్లేషకులు నిర్ధారణకు వచ్చారు. “మహర్షి”కి సంబంధించిన మరో టాప్ సీక్రెట్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఈ మూవీలో మహేష్ కాలేజీ విద్యార్థిగా, సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ గా, రైతుగా కనిపించనున్నట్లు తెలిసింది.

మూడు కోణాల్లో మహేష్ ని వంశీ చూపించబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మొదటి రెండు కోణాల్లో మహేష్ లుక్ బయటికి వచ్చి విశేషంగా ఆకట్టుకుంది. ఇక రైతుగా ఎలా ఉండబోతారో అనేది ఆసక్తికరంగా మారింది. రైతు సన్నివేశాల చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీ లో అంతా సిద్ధం చేశారు. త్వరలోనే అక్కడ షూటింగ్ మొదలుకానుంది. అల్లరి నరేష్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus