Mahesh Babu, Ram Charan: ఎన్టీఆర్ తో మిస్ అయ్యింది.. ఇప్పుడు చరణ్ తో వర్కౌట్ అవుతుందా..!

  • December 2, 2021 / 06:42 PM IST

కొన్నాళ్ళుగా టాలీవుడ్లో మల్టీస్టారర్ల హవా పెరిగిందనే చెప్పాలి. ఒకప్పటి స్టార్ హీరోలు ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేవారు. కానీ సీనియర్ స్టార్ హీరోలు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. స్టేజిని పంచుకోవడానికి వెనుకాడరు కానీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎందుకో వాళ్ళు ముందడుగు వేయలేదు. అయితే వెంకటేష్- మహేష్ లు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మళ్ళీ ఆ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వరుసగా బోలెడన్ని మల్టీస్టారర్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ఆర్.ఆర్.ఆర్’ ‘ఆచార్య’ ‘బంగార్రాజు’ ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలన్నీ మల్టీస్టారర్లే.. కానీ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మాత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ఒక్కటే..! అయితే దాని తర్వాత స్టార్ హీరోల కలయికలో మరిన్ని మల్టీస్టారర్లు రూపొందే అవకాశం ఉందని ఆల్రెడీ సంకేతాలు అందుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబు- చరణ్ ల కాంబోలో ఓ మల్టీస్టారర్ రూపొందనుందట. ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో ఈ ప్రాజెక్టు ఉండనుందని టాక్.

ఓ అగ్ర దర్శకుడు ముందుగా ఇదే బ్యానర్లో ఎన్టీఆర్- మహేష్ లతో మల్టీస్టారర్ చేయాలనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ విషయంలో అల్లు అరవింద్ గారు సంతృప్తి చెందలేదు. తర్వాత మురుగదాస్ కూడా ఓ మల్టీస్టారర్ కథని వినిపించాడు. అది కూడా అంతే..! కానీ ఇటీవల ఓ అగ్ర దర్శకుడు అరవింద్ గారికి మల్టీస్టారర్ కథని వినిపించారట. ఇది నచ్చడంతో ఓకే చెప్పేశారని తెలుస్తుంది. చరణ్- మహేష్ లు కూడా మల్టీస్టారర్ చేయడానికి సిద్దంగానే ఉన్నారట.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus