మహేష్ మూవీకి నిర్మాతగా మారనున్న చరణ్?

  • April 30, 2020 / 06:23 PM IST

సంక్రాంతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన నెక్స్ట్ మూవీ ప్రకటించలేదు. ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయాల్సివుండగా అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇక గీత గోవిందం హిట్ తో ఒక్కసారిగా ఫోకస్ లోకి వచ్చిన డైరెక్టర్ పరుశురాంతో మహేష్ మూవీ దాదాపు ఒకే అయినట్లే. దీనిపై ఈనెల 31న స్పష్టత రావచ్చు. ఆరోజు కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ నూతన చిత్ర ప్రకటన చేస్తారని తెలుస్తుంది.

ఐతే టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని హీరో రామ్ చరణ్ నిర్మించాలనుకుంటున్నారట. టాలీవుడ్ లో మంచి మిత్రులుగా ఉన్న వీరి మధ్య దీని గురించి ఇప్పటికే అవగాహన కుదిరిందని వినికిడి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరనేది స్పష్టత లేదు. బహుశా అది పరుశురాం మూవీ అయ్యే అవకాశం కూడా కలదు.

ఇక రాజమౌళితో మహేష్ చేయనున్న చిత్రానికి నిర్మాతగా కె ఎల్ నారాయణ ఉన్నారు. ఐతే ఆ మూవీకి ముందే మహేష్ కనీసం రెండు ప్రాజెక్ట్స్ చేస్తాడని వార్తలు వస్తున్న తరుణంలో రామ్ చరణ్ నిర్మించే మహేష్ చిత్రం ఆ రెండు చిత్రాలలో ఒకటి కావచ్చు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకొద్దిరోజులు ఆగాలి.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus