SSMB28: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మనసు మార్చుకున్న ‘మహేష్ 28’ టీం..!

  • May 25, 2021 / 02:13 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.సెప్టెంబర్ నెల చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇక దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాల తరువాత వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా.

అందులోనూ 11 ఏళ్ళ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టు పై అందరి దృష్టి పడింది. మే 31న మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ చిత్రాన్ని లాంచ్ చేయడంతో పాటు టైటిల్ ను కూడా ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘అతడే పార్ధు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు భోగట్టా. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను విదేశాల్లో జరపాలని చిత్రబృందం డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. కథ ప్రకారం హీరో క్యారెక్టర్‌కు ఫారిన్‌ టచ్‌ ఉండాలట .

‘అత్తారింటికి దారేది’ లా అనమాట. ఈ నేపథ్యంలో యు.కెలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఇండియాలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉండడం.. యు.కె లో దీని ప్రభావం తక్కువగా ఉండడంతో అక్కడే షూటింగ్ జరపడం మంచిది అనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తుంది. మరి ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది కూడా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించే వరకు అంచనా వేయడం కష్టం అనే చెప్పాలి.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus