Mahesh Babu-Trivikram: మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా!

  • August 10, 2021 / 11:54 AM IST

‘బాహుబలి’ సినిమా తరువాత టాలీవుడ్ హీరోల మైండ్ సెట్ మారిపోయింది. అందరూ పాన్ ఇండియా సినిమాలపై పడ్డారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇంకా ఈ రూట్ లోకి రాలేదు. రాజమౌళితో చేయబోయే సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతాడని అనుకున్నారు.

కానీ దానికంటే ముందే మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. అది కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కావడం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి ‘అతడు’, ‘ఖలేజా’ లాంటి సినిమాలు చేశారు. ఇప్పుడు మూడోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. టాలీవుడ్ లో టాప్ టెక్నిషియన్స్ తమన్, నవీన్ నూలి, మది లాంటి వారు ఈ సినిమాకి పని చేయనున్నారు.

హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందనుంది. ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus