పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు..!

  • November 2, 2020 / 05:36 PM IST

మహేష్ బాబు హీరోగా సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘అతిథి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు. ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ఇక్కడ ఆమెకు ఎక్కువ అవకాశాలు రాలేదు. దాంతో ఆమె తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. 2016వ సంవత్సరంలో ఈమె.. ప్రముఖ ఆర్.జె అయిన అన్మోల్ ను వివాహం చేసుకుంది. 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

ఇక తరువాత అమృత ప్రెగ్నెంట్ అవ్వడం.. ఇప్పుడు ఓ మగబిడ్డకు జన్మనివ్వడం అంతా చక చకా జరిగిపోయినట్టు తెలుస్తుంది.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందట.ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షమంగాను ఆరోగ్యంగానూ ఉన్నట్టు వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. అమృత అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. బాలీవుడ్‌లో ‘వివాహ్‌’, ‘ఇష్క్ – ‌విష్క్’‌, ‘మై హూనా’ వంటి విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది అమృత.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus