నవంబర్ 1 నుంచి అహ్మదాబాద్ లో షూటింగ్

  • October 24, 2016 / 10:12 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఖమ్మంలోని కొత్తగూడెంలో షూటింగ్ జరుపుకుంటోంది. విశ్రాంతికి ముందు వచ్చే కీలక సన్నివేశాన్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ వీకెండ్ లో షెడ్యూల్ కి పేకప్ చెప్పనున్నారు. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని దీపావళికి రిలీజ్ చేసేందుకు మురుగదాస్ బృందం శ్రమిస్తోంది.

ఈ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుని నెక్స్ట్ షెడ్యూల్ కోసం మహేష్ బాబు గుజరాత్ కి పయనం కానున్నారు. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో నవంబర్ 1 నుంచి మొదలుకానున్న షెడ్యూల్ లో బిజీ కానున్నారు. అక్కడే నెలరోజుల పాటు కొనసాగనున్న చిత్రీకరణలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, విలన్ ఎస్.జె.సూర్య, ఇతర నటులు పాల్గొననున్నారు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్న ఈ మూవీని వేసవిలో ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus