పీవీపీకి టాటా చెప్పిన మహేష్ బాబు

  • December 17, 2016 / 07:23 AM IST

సినీ ఇండస్ట్రీ వర్గాలవారికి సెంటి మెంట్స్ ఎక్కువ. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ కేటగిరీలోకి వస్తారు. మూవీ ప్రారంభోత్సవానికి తాను వస్తే అది ప్లాప్ అవుతుందని ప్రిన్స్ గట్టి నమ్మకం. అందుకే మహేష్ అటెండ్ కారు. ఇప్పుడు మరో విషయంలో సెంటి మెంట్ ని ఫాలో అయ్యారు. పీవీపీ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన బ్రహ్మోత్సవంపై సూపర్ స్టార్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అది ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో పీవీపీ కాంబినేషన్ పై నమ్మకం పోయింది. వారు మహేష్ తో సినిమా తీయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం ఇష్టం లేరు.

మొహమాటానికి మొదట అంగీకరించినా.. 25 వ సినిమా వారి బ్యానర్లో అని తలుచుకుంటే సూపర్ స్టార్ కి బయమేస్తోందంట. అందుకే ఇప్పుడు వద్దులే అని రీసెంట్ గా చెప్పేశారని తెలిసింది. ఇప్పుడు ఆ ప్రాజక్ట్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారని సమాచారం. మరో అగ్ర నిర్మాత అశ్వినీదత్ కూడా ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టనున్నట్లు టాక్. మొత్తానికి వంశీ పైడిపల్లీ దర్శకత్వం వహించనున్న మూవీ రెండు పెద్ద బ్యానర్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నసూపర్ స్టార్, తర్వాత  కొరటాల శివ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే వంశీ ప్రాజక్ట్ పట్టాలెక్కనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus