రాజ్ దూత్ నుంచి ‘మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశ’ సాంగ్ విడుద‌ల‌!

  • June 21, 2019 / 03:08 PM IST

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘామ్ష్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా లిరిక‌ల్ సింగిల్స్ తో శ్రోత‌ల్ని మెప్పించడానికి రెడీ అయింది యూనిట్. దీనిలో భాగంగా నేడు సినిమాలోని తొలి సింగిల్ `మ‌న‌సున మ‌న‌సున ఏదో ఆశా` అంటూ సాగే మెలోడీ సాంగ్ ను హైద‌రాబాద్ రేడియో సిటీలో విడుద‌ల చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర హీరో మేఘామ్ష్, ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన కార్తీక్ పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా

హీరో మేఘామ్ష్ మాట్లాడుతూ : సినిమాలో మొత్తం నాలుగు పాట‌లున్నాయి. ప్ర‌తీ పాట ప్ర‌త్యేకంగా ఉంటుంది. క‌థ‌లో ఇమిడిపోయే పాట‌ల‌వి. ఇప్పుడు విడుద‌ల చేసిన మ‌న‌సున మ‌న‌సున సాంగ్ ప్రేమలో భావాల‌ను ఎలివేట్ చేస్తుంది. ఈ పాట షూటింగ్ స‌మ‌యంలో చాలా ఎంజాయ్ చేసాను. శ్రోత‌ల్ని కూడా మెప్పిస్తుంది. మిగతా పాట‌లు చ‌క్క‌గా కుదిరాయి. ఇటీవ‌ల రిలీజ్ అయిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ ను మెచ్చిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైన కార్తీక్ మాట్లాడుతూ: మంచి మెలోడీ సాంగ్ ఇది. ఈ పాట‌ సాహిత్యం సినిమాలో ఎమోష‌న్ ని ఎలివేట్ చేస్తుంది. నాకు క‌రుణాక‌ర‌న్ సినిమాలో పాట‌లంటే బాగా ఇష్టం. ఈ పాట‌ని ఆయ‌న స్టైల్లో చేసే ప్ర‌య‌త్నం చేసాం. కిట్టు అందించిన‌ లిరిక్స్, వ‌రుణ్ సునీల్ సంగీతం, సిద్ధార్థ్ మీన‌న్ వాయిస్ చ‌క్క‌గా కుదిరాయి. ముఖ్యంగా యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యే పాట‌. సినిమాలో మిగ‌తా పాట‌లు అంద‌ర్ని అల‌రిస్తాయి` అని తెలిపారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus