అఖిల్ ఎంగేజ్ మెంట్ వేడుకలో మంచు లక్ష్మి నృత్య ప్రదర్శన
December 9, 2016 / 07:59 AM IST
|Follow Us
టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ మహిళగా మంచు లక్ష్మి పేరు తెచ్చుకుంది. బుల్లితెర పైన చాట్ షో లతో రేటింగ్ పెంచే ఈమె వెండితెరపై హీరోయిన్ గా, విలన్ గా నటించి డైలాగ్ కింగ్ కూతురు అనిపించుకుంది. కేవలం నటించడానికే కాకుండా సినిమాలు నిర్మించి సక్సస్ ఫుల్ లేడీ నిర్మాతగా దూసుకుపోతోంది. సినీ అవార్డుల వేదికలపై హోస్ట్ గా వ్యవహరించే మంచు లక్ష్మి ఇప్పుడు తన డ్యాన్స్ ట్యాలెంట్ తో అదరగొట్టేందుకు సిద్ధమైంది. అక్కినేని అఖిల్ కి నేడు తన ప్రియురాలు శ్రేయ భూపాల్ తో నిక్షితార్ధం వైభవంగా జరగనుంది.
జీవీకే రెడ్డి, కింగ్ నాగార్జున వియ్యంకులు కానున్న ఈ శుభవేడుకలో మిల్కీ బ్యూటీ తమన్నా తో పాటు ముంబై డ్యాన్సర్లు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. వారితో పాటు ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి డ్యాన్స్ చేస్తున్నట్లు వెల్లడించింది. స్నేహ పూర్వకంగా, ఆనందంతో ఈ డ్యాన్స్ వేయడానికి తాను ఒప్పుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకొవడంలేదని స్పష్టం చేసింది. ఈ రోజు రాత్రి జీవీకే ప్యాలెస్ లో జరగనున్న అఖిల్ ఎంగేజ్ మెంట్ కి సినీ నటులు, రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు హాజరుకానున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.