Mangalavaaram: రిస్క్ చేస్తున్న ‘మంగళవారం’ టీం.. ఏమైందంటే..!

  • November 15, 2023 / 07:41 PM IST

‘ఆర్. ఎక్స్.100 ‘ పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న దర్శకుడు అజయ్ భూపతి తర్వాత ‘మహాసముద్రం’ అనే బిగ్ బడ్జెట్ మూవీ చేశాడు. కానీ అది బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తానే నిర్మాతగా మారి ‘మంగళవారం’ అనే థ్రిల్లర్ మూవీ చేశాడు. నవంబర్ 17 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

రూ.20 కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికీ నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ లో ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇదిలా ఉండగా.. ‘మంగళవారం’ టీం ఇప్పుడు డేరింగ్ స్టెప్ వేయబోతున్నారు. అదేంటి అంటే.. నవంబర్ 17 న ఈ సినిమా (Mangalavaaram) రిలీజ్ కాబోతుంటే..

నవంబర్ 16 రాత్రి నుండి పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. అవును.. నిజమే.. నవంబర్ 16 నుండి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మల్టీ ప్లెక్సుల్లో ‘మంగళవారం’ ప్రీమియర్స్ వేయనున్నారు. ఇది చాలా రిస్కీ డెసిషన్. ఎందుకంటే టాక్ ఏమాత్రం నెగిటివ్ గా వచ్చినా.. మొదటి రోజు కలెక్షన్స్ ఉండవు. అయినా దర్శకుడు అజయ్ భూపతి అండ్ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus