మ‌ణిర‌త్నం సినిమాలో నటించకపోవడానికి కారణం ఏమిటంటే?

  • September 1, 2018 / 06:40 AM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఒక్కసారైనా పని చేయాలనుకుని అటు కోలీవుడ్, టాలీవుడ్ నటీనటులు మాత్రమే కాదు బాలీవుడ్ నటులు కూడా ఆశపడుతుంటారు. అటువంటి ఆఫర్ ని విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చింది. అయినా తాను నో చెప్పడం.. ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన జరిగి కొన్ని నెలలలు అవుతోంది. తాజాగా బయటపడింది. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడ్డ విజయ్ దేవరకొండ… అర్జున్ రెడ్డి సినిమాతో పొరుగురాష్ట్రాల ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించారు. అప్పుడే మణిరత్నం నవాబ్ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.

అందులో ఒక కీలకరోల్ కి విజయ్ దేవరకొండ ని అడిగారంట. కానీ సున్నితంగా నో చెప్పినట్టు సమాచారం. గొప్ప డైరక్టర్ ఆఫర్ ని ఎందుకు వదులుకున్నారని.. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్టు తెలిసింది. మొదటిది రెమ్యునరేషన్ సంతృప్తికరంగా లేకపోవడం. అలాగే సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండడం. వాటిలో ఒకరిగా నటించడం ఇష్టంలేక వదులుకున్నట్టు తెలిసింది. దాంతో ఆ పాత్రకు మణిరత్నం తమిళ హీరో శింబుని తీసుకున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిన నవాబ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ సంచలనం అవిజయం సాదిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus