Maniratnam, Mahesh: మహేష్ కి కథ చెబుతానంటున్న స్టార్ డైరెక్టర్!

  • July 10, 2021 / 12:06 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా కాలంగా మీడియాలో వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు. ఈ వార్తలు వచ్చినప్పటి నుండి అభిమానులు ఈ కాంబో ఎప్పుడు వర్కవుట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల మణిరత్నం.. మహేష్ ని కలిసి కథ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ విషయంపై మణిరత్నం స్పందించారు.

మహేష్ కి కథ చెప్పిన మాట నిజమేనని తెలిపారు. మహేష్ కథ విన్నారని.. కానీ కొన్ని కారణాల వలన అది వర్కవుట్ కాలేదని.. ఆయన స్పష్టం చేశారు. కథలను బట్టే నటీనటులను ఎంపిక చేసుకుంటానని.. త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఏ విషయానికైనా.. సమయం, సందర్భం రావాలని అన్నారు. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు.అలానే ‘నవరస’ అనే వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మరోపక్క మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. దీని తరువాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</stro

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus