Manisha Koirala: అబ్బో ‘అల’ రీమేక్ కోసం అక్కడ పెద్ద స్టార్ నే దింపుతున్నారే..!

  • June 22, 2021 / 04:18 PM IST

అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’.2020 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.పూజా హెగ్డే గ్లామర్… మురళీశర్మ నటన కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. త్వరలోనే ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కాబోతుంది.

అక్కడి లేటెస్ట్ సెన్సేషన్ కార్తిక్‌ అర్యన్‌ ఈ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు. రోహిత్‌ ధావన్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు ఇదిలా ఉండగా.. ఈ రీమేక్ లో మనీషా కొయిరాలా కూడా నటించబోతున్నట్టు తాజా సమాచారం. తెలుగు వెర్షన్‌లో టబు పోషించిన తల్లి పాత్రను ఈమె పోషించబోతుందట. స్టోరీ అలాగే ఆమె పాత్ర నచ్చడంతో ఈ రీమేక్‌లో నటించడానికి ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే ప్లేస్ లో కృతిసనన్‌ హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం.

ఏక్తాకపూర్‌ ఈ రీమేక్ ను నిర్మించనున్నారు.అయితే తెలుగులో ఈ చిత్రానికి హైప్ పెరగడానికి కారణం తమన్ సంగీతం. మరి ఆ స్థాయిలో ఈ రీమేక్ కు ఎవరు సంగీతమే అందిస్తారు? అనే విషయం పై ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పటి నుండీ సందేహాలు మొదలయ్యాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus