మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా ప్రారంభం !!

  • May 10, 2017 / 12:29 PM IST

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త సంజయ్ స్వరూప్, జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (మే 10) హైద్రాబాద్ లోని ఫిలిమ్ నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది.సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రంలో త్రిధా చౌదరి, అమైరా దస్తూర్ కథానాయికలు.

హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మంజుల కుమార్తె జాహ్నవి క్లాప్ కొట్టగా.. మంజుల సోదరీమణులు పద్మావతి ఘట్టమనేని (మంత్రి జయదేవ్ గల్లా సతీమణి) – ప్రియదర్శిని ఘట్టమనేని (కథానాయకుడు సుధీర్ బాబు సతీమణి) కెమెరా స్విచ్చాన్ చేశారు. మంజుల ఘట్టమనేని గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర ప్రారంభోత్సవంగా సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “ఈనెల 20 నుంచి గోవాలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మంజుల ఈ సినిమా కోసం కథ-కథనం కూడా అందించడం విశేషం. సందీప్ అయితేనే ఈ కథకు యాప్ట్ అవుతాడు. ఒక సరికొత్త ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది” అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus