అందుకే ‘మత్తు వదలరా’ లో ఆ సీన్లని తొలగించారట..!

  • December 30, 2019 / 02:57 PM IST

కీరవాణి కొడుకులు సింహా, కాల భైరవ లు ‘మత్తు వదలరా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను రాబడుతోంది. రితేష్ రానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో కొంత పార్ట్ ను కట్ చేశారట. కంగారు పడకండి రిలీజ్ అయ్యాక ఏమీ కట్ చేయలేదు.. రిలీజ్ కొద్ది గంటల ముందు.. కట్ చేశారట.

‘మత్తు వదలరా’ సినిమా క్లైమాక్స్ కాస్త ల్యాగ్ అయ్యింది అనే కామెంట్స్ బలంగా వినిపించాయి. నిజానికి ఇంకా లెంగ్తీగా ఉందట. షకలక శంకర్ కామెడీ ట్రాక్ కూడా ఉండేదట. కానీ జనాలు మరింత బోర్ ఫీలయ్యే ప్రమాదం ఉండనే ఉద్దేశంతో చివరి నిమిషంలో తొలగించారట. నిజానికి అదే మంచి పని అయ్యింది అని.. ఇప్పుడు కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎలాగూ హిట్ టాక్ వచ్చింది కదా అని.. ఇప్పుడు డిలీట్ చేసిన ట్రాక్ ను యాడ్ చెయ్యాలనే ఆలోచనలో కూడా నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు!
2019లో మరణించిన తారలు?
ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus