‘మత్తు వదలరా’ టీజర్ రివ్యూ!

  • December 7, 2019 / 06:05 PM IST

‘మైత్రి మూవీ మేకర్స్’ ‘క్లాప్ ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. కీరవాణి తనయులు ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీ సింహా హీరోగా కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసాడు. చరణ్ తన పేస్ బుక్ పేజీ ద్వారా స్పందిస్తూ.. ‘ శ్రీ సింహా నా ‘రంగస్థలం’ చిత్రానికి పనిచేసాడు. హీరోగా ఎంట్రీగా ఇవ్వబోతున్నావ్.. నీకు గ్రాండ్ వెల్కమ్. ఇక కాల భైరవ వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం.. ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నావ్. నీ మ్యూజిక్ ఎలా ఉంటుందా అని క్యూరియాసిటీ తో ఎదురుచూస్తున్నాను. టీజర్ అయితే చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు చరణ్.

ఇక టీజర్ విషయానికి వస్తే.. అతి నిద్ర వల్ల ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తుంది. శ్రీ సింహా పాత్ర యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం సాగుతుందని టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. వెన్నెల కిషోర్, సత్య వంటి కమెడియన్లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది. టీజర్ అయితే కచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus