అంతరిక్షం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్న మెగాబ్రదర్స్

  • November 23, 2018 / 10:09 AM IST

తెలుగు సినిమా చరిత్రలో మొట్ట మొదటిసారిగా అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ‘అంతరిక్షం’. ‘ఘాజి’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా, లావణ్య త్రిపాఠి, అతిధి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై క్రిష్ జాగర్లమూడి సమర్పిస్తున్నాడు. ఇందులో హీరో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పైన అంచనాలు పెరిగాయి.

ఇక తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉండటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా వస్తున్నారని సమాచారం. వీరిద్దరిని దృష్టిలో ఉంచుకొని వారికీ అనుగుణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని డిసెంబర్ 9 వ తేదీన ప్లాన్ చేశారంటా. కానీ మెగాబ్రదర్స్ ఇద్దరు వస్తున్నారనేది ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగా వీరిద్దరూ కనుక వస్తే మెగా అభిమానులకు పండగే. ఇక ఈ సినిమా డిసెంబర్ 21 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus