ఒకే ప్రేమ్ లో సందడి చేసిన మెగా హీరోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • December 21, 2022 / 03:10 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా ఈ రెండు కుటుంబాల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు వచ్చాయనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ వార్తలను కొట్టి పారేస్తూ మెగా అల్లు కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే పండుగలను అందరూ కలిసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకుంటూ ఆ వార్తలకు చెక్ పెడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో మరోసారి ఈ రెండు కుటుంబాలు ఒకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో పెద్దవారు కాకుండా కేవలం యంగ్ స్టర్స్ మాత్రమే పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలలో భాగంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ తేజ్, చైతన్య, సుస్మిత, శ్రీజ, ఉపాసన, నిహారిక, స్నేహ రెడ్డి వంటి తదితరులు కలిసి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోల పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ మెగా కజిన్స్ సీక్రెట్ శాంటా అని క్యాప్షన్ ఇచ్చాడు.

అదేవిధంగా స్నేహ రెడ్డి సైతం తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఎప్పటిలాగే ఈమె చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఏది ఏమైనా మెగా హీరోలు అందరిని కూడా ఇలా ఒకే ప్రేమ్ లో చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus