Allu Aravind: బాలయ్య టాక్ షోకి ఫస్ట్ గెస్ట్ అతనేనట..!

  • October 26, 2021 / 07:19 PM IST

‘ఆహా’….ఓటిటి కోసం బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్.ఈ షో కోసం ఇద్దరు దర్శకులు కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బాలయ్య మాట్లాడడం మొదలుపెడితే అది నిజంగా అన్‌స్టాప‌బులే. ఎక్కడ మొదలుపెడతాడో.. ఇంకెక్కడికి వెళతాడో.. ఎక్కడ ముగిస్తాడో ఎవ్వరికీ అర్ధం కాదు. ఆయన భావం ఒకటుంటుంది.. పదజాలం ఇంకోటి ఉంటుంది.. ఫైనల్ గా అది ఇంకేదో సందర్భానికి దారి తీస్తుంది. అలాంటి బాలయ్యతో టాక్ షో అంటేనే చాలా వింతగా విడ్డూరంగా ఉంది.

వచ్చే సెలబ్రిటీలు చెప్పే సమాధానాలకంటే బాలయ్య అడిగే ప్రశ్నలే జనాల్లో అటెన్షన్ ను డ్రా చేస్తాయి. అలాంటిది మొదటి ఎపిసోడ్ కే మోహన్ బాబుని గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారని టాక్. ఇది నిజంగా ఒక సంచలనమే..! అసలే మోహన్ బాబు.. చిరు కి మధ్య ఇప్పుడు మళ్ళీ కోల్డ్ వార్ నడుస్తుంది. మోహన్ బాబు ‘మా’ ఎలక్షన్స్ సమయంలో బహిరంగంగానే చిరు పై సెటైర్లు వేశారు. విష్ణు సైతం కాస్త ఎక్కువే మాట్లాడాడు.

మరి అలాంటప్పుడు ఇప్పుడు మోహన్ బాబుని గెస్ట్ గా పిలిస్తే ‘మా’ గురించి డిస్కషన్లు కచ్చితంగా పెడతాడు. దీనికి మెగా ఫ్యామిలీకి చెందిన డిజిటల్ ప్లాట్ ఫామే వేదిక కావాలా అనేది మెగా ఫ్యాన్స్ అసంతృప్తి. అందుకే అల్లు అరవింద్ పై వారు ఫైర్ అవుతున్నారు. లేదు అంటే ‘మా’ ఊసే ఎత్తనివ్వకుండా స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తే గొడవే ఉండదు. మరి అరవింద్ గారు ఈ మొదటి ఎపిసోడ్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus