ఆ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ తీస్తానన్న మెగా హీరో!

  • August 30, 2022 / 12:13 PM IST

మెగా హీరోలలో ఒకరైన వైష్ణవ్ తేజ్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉప్పెన సినిమాలో తన నటనతో వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తొలి సినిమాతోనే కథ నచ్చితే రిస్కీ ప్రాజెక్ట్ లలో కూడా నటించడానికి సిద్ధమని వైష్ణవ్ తేజ్ సంకేతాలు ఇచ్చారు. కొండపొలం సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా వైష్ణవ్ తేజ్ కెరీర్ పై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. మరో మూడు రోజుల్లో వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచింది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైగర్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అయితే రంగ రంగ వైభవంగా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ భవిష్యత్తులో తనకు డైరెక్టర్ కావాలని ఉందంటూ మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు.

సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లను హీరోలుగా పెట్టి సినిమా డైరెక్ట్ చేయాలని ఉందని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కచ్చితంగా డైరెక్షన్ చేస్తానని వైష్ణవ్ తేజ్ కాన్ఫిడెంట్ గా చెప్పడంతో ఈ మెగా హీరో డైరెక్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కోసం కథ రాసుకున్నానని త్వరలోనే తన డైరెక్షన్ లో సినిమా వస్తుందని ఈ మెగా హీరో కామెంట్లు చేశారు.

మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు నిర్మాతలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ మాత్రం వాళ్లకు భిన్నమైన రూట్ లో ప్రయాణం చేస్తుండటం గమనార్హం. వైష్ణవ్ తేజ్ కు సినిమాసినిమాకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus