శ్రీహరి కొడుకు ఆకట్టుకుంటాడా?

  • June 25, 2019 / 03:40 PM IST

దివంగత నటుడు రియల్‌ స్టార్‌ శ్రీహరి కొడుకు మేఘాంశ్‌ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ‘రాజ్‌ దూత్‌’ అనే చిత్రంతో మేఘాంశ్ ఎంట్రీ ఇస్తున్నాడు. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అర్జున్‌ – కార్తీక్‌ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎమ్‌.ఎల్‌.వి సత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాత. జూలై 5న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. రియల్‌ స్టార్‌ కొడుకు ఈ మొదటి చిత్రంతో హిట్టందుకోవాలని ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా ‘హీరో మేఘాంశ్‌ చాలా బాగా నటించాడని, అతని పాత్రకు మేఘాంశ్‌ పూర్తి న్యాయం చేసాడని… సినిమా ఎలా ఉన్నా.. మేఘాంశ్‌ ఇండస్ట్రీలో హీరోగా నిలబడతాడని’ చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరి వారి మాటల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే జూలై 5 వరకూ వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో సుదర్శన్‌, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్‌ తదితరులు నటించారు. విద్యా సాగర్ సినిమాటోగ్రాఫీ అందించగా.. విజయవర్దన్ కావూరి సంగీతం అందించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus