ఎన్టీఆర్ గురించి నేనేమీ అనలేదు : మేఘాంశ్

  • June 27, 2019 / 06:52 PM IST

దివంగత నటుడు హీరో అయిన శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రాజ్ దూత్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు మేఘాంశ్. శ్రీహరి హీరోగా నటించిన ‘భైరవ’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మేఘాంశ్.. తన తండ్రి మరణం తరువాత నటనలో శిక్షణ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు యువకులు కలిసి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా ‘లక్ష్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సత్తిబాబు నిర్మించాడు.ఇక ఈ చిత్రం జులై 5న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్లను కూడా వేగవంతం చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హీరో మేఘాంశ్. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని కూడా తెలిపాడు.

మేఘాంశ్ మాట్లాడుతూ.. “నన్ను హీరోగా చూడాలన్నది నాన్న కల. ఆయన ఉండుంటే.. చాలా బాగుండేది. నాన్న ఉండుంటే నటనలో నాకు గైడెన్స్ ఇచ్చేవారు కూడా.! నాన్న దూరమైన తర్వాత అమ్మ తరుపున వాళ్ళు, నాన్న తరపున వాళ్ళు అన్ని చూసుకున్నారు. ఇదిలా ఉంటే నేను జూ. ఎన్టీఆర్ గురించి మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. జూ. ఎన్టీఆర్ మాకు సాయం చేశాడని నేన్ను చెప్పినట్లు మీడియాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నేను ఏమీ అలా మాట్లాడలేదు. అయినా ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో నాకు అర్ధం కావట్లేదు. నేను అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు.” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus