చిన్మయి పుణ్యమా అని అభాసుపాలవుతున్న మణిరత్నం

  • September 12, 2019 / 11:13 PM IST

మీటూ మూమెంట్ కు ఒక సీరియస్ నెస్ ను తీసుకురావడంతో సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కీలకపాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కారణంగా ఇండస్ట్రీలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్స్, సింగర్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అందరూ ధైర్యంగా తమ బాధలను ప్రపంచానికి చాటి చెప్పి.. తమకు ఇబ్బంది కలిగించిన మృగాళ్లను సోషల్ మీడియా సాక్షిగా ఎండకట్టారు.

అయితే.. అలా చిన్మయి ఎండగట్టినవాళ్లలో పాపులర్ తమిళ రైటర్ వైరముత్తు ఒకరు. ఆమెను చాన్నాళ్లు అసభ్యకరంగా వేధించాడని చిన్మయి అప్పట్లో వైరముత్తును రోడ్డుకీడ్చింది. ఇప్పుడు అదే లిరిక్ రైటర్ ను మణిరత్నం తన తాజా చిత్రం కోసం ఎంపిక చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఇలాంటి రైటర్ ను ఎలా ఎంకరేజ్ చేస్తారు అని మణిరత్నంను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. అసలు ఇప్పటివరకూ ఎలాంటి కాంట్రవర్సీల్లోనూ భాగం అవ్వని మణిరత్నం ఇప్పుడు చిన్మయి కారణంగా నెటిజన్ల కోపాగ్నిని చవి చూడాల్సి వచ్చింది.

1

2

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus