రూ.10కోట్ల నష్టపరిహారం అడుగుతూ నటి పిటిషన్!

  • July 24, 2021 / 12:57 PM IST

అన్నాడీఎంకే మాజీమంత్రి మణికందన్ కు నటి చాందిని మరో షాక్ ఇచ్చారు. మణికందన్ తనకు నష్టపరిహారంగా రూ.10 కోట్లు చెల్లించాలంటూ గురువారం స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నటి చాందిని. మ‌ణికంద‌న్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి అన్ని విధాలా వాడుకున్నాడంటూ గతంలో చాందిని చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు మణికందన్ ను అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో చాందిని గురువారం సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో మణికందన్ తనకు పదికోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. అలానే తాను చెన్నైలో ఉండి కోర్టు కేసు వ్యవహారాలను చూసుకోవాల్సి ఉండడంతో దానికోసం ఆమెకి నెలవారి అయ్యే ఖర్చులు కూడా మాజీ మంత్రే చెల్లించాలంటూ పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై వచ్చే నెల 5న కోర్టు విచారణ చేపట్టనుంది.

తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత సీఎంగా ఉన్న టైంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus