మిస్టర్ ఇండియా సీక్వెల్ క్యాన్సిల్ చేసిన శేఖర్ కపూర్.!

  • May 15, 2018 / 02:07 PM IST

శ్రీదేవిని బాలీవుడ్ లో సూపర్ స్టార్ ను చేయడంలో కీలకపాత్ర పోషించినటువంటి చిత్రం “మిస్టర్ ఇండియా”. అనిల్ కపూర్ కథానాయకుడిగా బోణీ కపూర్ నిర్మాణంలో శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం అప్పట్లో బోలెడన్ని సంచలనాలు సృష్టించింది. 1987లో విడుదలైన ఆ చిత్రానికి 2018లో సీక్వెల్ ను రూపొందించాలని దర్శకనిర్మాత ద్వయం శేఖర్ కపూర్-బోణీ కపూర్ లు అనుకొన్నారు. ఈ చిత్రంలో శ్రీదేవితోపాటు ఆమె ఇద్దరు అమ్మాయిలను కూడా నటింపజేయాలన్నది శేఖర్ కపూర్ ఆలోచన.

అయితే.. శ్రీదేవి అర్ధాంతరంగా చనిపోవడంతో “మిస్టర్ ఇండియా” సీక్వెల్ ఆలోచనను మానుకొన్నాడు దర్శకుడు శేఖర్ కపూర్. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా.. “అసలు శ్రీదేవి లేకపోతే మిస్టర్ ఇండియానే లేదు. అలాంటిది ఆవిడ లేకుండా మిస్టర్ ఇండియాకు సీక్వెల్ తీయాలన్న ఆలోచన మాత్రం ఎందుకొస్తుంది. అందుకే ఆ ఆలోచనను పక్కనేట్టేసామ్ అంటూ సమాధానమిచ్చాడు శేఖర్ కపూర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus