సోనాలి బింద్రే చనిపోయిందంటూ ఎమ్మెల్యే పోస్ట్..!

  • September 8, 2018 / 07:39 AM IST

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ తన వ్యాఖ్యలతో అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. కృష్ణాష్టమి రోజున అమ్మాయిలను కిడ్నాప్ చేయాలంటూ.. యువకులకు పిలుపునిచ్చిన ఆయన తాజాగా మరో ట్వీట్ చేసి విమర్శల పాలవుతున్నారు. బ్రతికున్న సోనాలి బింద్రే చనిపోయిందంటూ ట్విట్టర్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. కేన్సర్ తో బాధపడుతున్న సోనాలి కన్నుమూసిందంటూ రామ్ కదమ్ కి వచ్చిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఆ స్క్రీన్ షాట్ లో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన సోనాలి బింద్రే ఇక లేరు అని రాసి ఉంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన ఈ పోస్ట్ షేర్ చేయడంతో నెటిజన్లు ఆయనపై ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తను షేర్ చేస్తారా అంటూ అతడిపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సదరు ఎమ్మెల్యే వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేసి అందరికీ క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేశారు. సోనాలి బింద్రే తొందరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus