మంచు లక్ష్మి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

  • March 17, 2016 / 06:24 AM IST

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన నేటి తరం తార మంచి లక్ష్మి. ఆమె తొలుత నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ తరువాత మెల్లగా…తాను నిర్మించిన సినిమాల్లోనే కీలక పాత్రలు పోషిస్తూ తనలోని టాలెంట్ ను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇదిలా ఉంటే నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్న ఆమెకు ఇతర బ్యానర్స్ లో సైతం అవకాశాలు లభించడంతో వాటిల్లో సైతం నటిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…తాజాగా ఆమె ఒక సినిమాలో నటించిన ఒక గెస్ట్ రోల్ విషయమై తండ్రి మోహన్ బాబు ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది. ఇంతకీ ఏంటి ఆ సినిమా….అంటారా…ఒక్కసారి మీరే చదవండి…

హాట్ భామ రేష్మి గౌతమ్ అందాల ఆరబోతకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన ‘గుంటూర్ టాకీస్’  సినిమాలో లక్ష్మీ ప్రసన్న చిన్న రోల్ లో నటించింది. హీరో దగ్గర డబ్బులు కొట్టేసే ఒక సీన్ లో మంచు లక్ష్మి కనిపిస్తుంది. అది చాలా చిన్న గెస్ట్ రోల్. అయితే ఈ రోల్ చెయ్యడంపై మోహన్ బాబు కోపంతో లక్ష్మిని పిలిపించి…అసలు అలాంటి బీగ్రేడ్ సినిమాలో నువ్వెందుకు గెస్ట్ రోల్ చేసావు, ఒకవేళ చేసినా అలాంటి సీన్ లో ఎందుకు కనిపించావ్ అంటూ లక్ష్మీ మంచుకి పెద్ద క్లాస్ తీసుకున్నాడట. దీనితో అనుకోని షాక్ కు గురైన మంచు లక్ష్మి తనకు ప్రవీణ్ సత్తారు మీద ఉన్న గౌరవంతో ఆ చిన్న రోల్ చేసానని ఇంకెప్పుడు అలా చేయనని తన తండ్రికి మంచు లక్ష్మి సర్ది చెప్పుకుంది అని టాక్. ఏది ఏమైనా…మోహన్ బాబు మరోసారి మొహమాటం లేకుండా మాట్లాడతాడు అని మరోసారి నిరూపించుకున్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus