MAA Elections: మా ఎన్నికల్లో గందరగోళం.. చంపేస్తాను అంటూ మోహన్ బాబు హెచ్చరిక

  • October 10, 2021 / 12:09 PM IST

మా ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మా పోలింగ్‌లో రిగ్గింగ్‌ అనుమానాలు రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడంటూ మంచు విష్ణు బృందం ఆరోపణలు చేయడంతో కొద్దీ సేపటి వరకు పోలింగ్‌ నిలిచిపోయింది. ఇక ఈ సమయంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. నటుడు బెనర్జీపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో విష్ణు, ప్రకాష్ రాజ్ ఫ్యానెల్ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగి ఆ తరువాత తీవ్ర పరిణామాలకు దారి తీశాయి.

నటి హేమ ఒక నటుడి చేయి కొరికినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒకరిపై ఒకరు దూషించుకోవడమే కాకుండా చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్ బాబు ఎన్నికల అధికారితో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆ సమయంలో నటుడు బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేయగా మోహన్ బాబు చంపేస్తాను అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని చూపించారు. రిగ్గింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు బృందాలను పిలిపించిన ఎన్నికల అధికారి… రెండు బృందాలతో చర్చలు జరిపారు. రిగ్గింగ్‌ చేసినట్లు తేలితే ఫలితాలు ప్రకటించను, కోర్టుకు వెళ్తామని కూడా ఎన్నికల అధికారి తెలియజేశారు. ఇక ఈ వివధాలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus