ట్రేండింగ్ లో ఉన్న ఇండియన్ టాప్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ ..!

  • March 20, 2019 / 12:49 PM IST

2019 సంవత్సరంలో ఇండియా వైడ్ 5 భారీ మల్టీ స్టారర్స్ మొదలయ్యాయి. ఇప్పటికే వీటిలో నాలుగు రిలీజ్ డేట్స్ ను కూడా ఫిక్స్ చేసుకోవడం విశేషం.వందేళ్ళ భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇలా జరగనుండడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం కావడం విశేషం. ఇక ఆ చిత్రమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఐదు చిత్రాలు ఏంటంటే … ‘ఆర్.ఆర్.ఆర్’ ‘సైరా’ ‘కళాంక్’ ‘బ్రహ్మాస్త్ర’ ‘మరక్కర్’ కావడం విశేషం.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇప్పటికే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇండియా వైడ్ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రాన్ని 300 – 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీ.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 30 న విడుదల చేయబోతున్నట్టు ఖరారు చేసేసారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం కూడా ఓ మల్టీ స్టారర్ అనే చెప్పాలి.ఎందుకంటే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతుంది. హిస్టారికల్ నేపద్యం లో ఓ వీరుని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం 2019 ఆగస్టు లేదా అక్టోబర్ లో విడులవుతుందని సమాచారం.

బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అమితాబ్ బచ్చన్ – రణబీర్ కపూర్ – ఆలియాభట్ – నాగార్జున వంటి స్టార్స్ తో రూపొందుతోన్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని ‘ధర్మ ప్రొడక్షన్స్’ – ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ క్రేజీ చిత్రం దదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతుంది. కరణ్ జోహార్ రూపొందిస్తున్న ఈ భారీ ఫిక్షన్ చిత్రం 2019 డిసెంబర్ 20న విడుదల కాబోతుంది.ఇక మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కళాంక్’ కూడా సంజయ్ దత్ – మాధురి ధీక్షిత్ – సోనాక్షి సిన్హా – ఆలియాభట్ – వరుణ్ ధావన్ – ఆదిత్య రాయ్ కపూర్ వంటి భారీ తారగణం తో రూపొందుతుంది. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కూడా ‘ధర్మ ప్రొడక్షన్స్’ ‘ఫాక్స్ స్టార్ స్టూడియోస్’ కలిసి నిర్మిస్తుండగా ‘నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్ మెంట్స్’ కూడా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 80- 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న… ఈ చిత్రం 2019 లోనే ఏప్రిల్ 19 న విడుదలకాబోతుంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న మరో భారీ మల్టీస్టార్ర్ చిత్రం `మరక్కర్`. మోహన్ లాల్ తో పాటూ నాగార్జున- సునీల్ శెట్టి- అర్జున్ షార్జా- సిద్ధిఖి- ప్రభుదేవా- సుదీప్ వంటి భారీ తారాగణంతో రూపండుతున్న ఈ చిత్రాన్ని ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘ఆశీర్వాద్ సినిమాస్’ ‘మూన్ షాట్ ఎంటర్ టైన్ మెంట్స్’ ‘కాన్ఫిడెంట్ గ్రూప్’ కలిసి నిర్మిస్తున్నాయి. 2020లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.మొత్తానికి ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రాలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. మరి ఈ చిత్రాలు విడుదలయ్యాక ఎలాంటి సంచలనాలు నామోదుచేస్తాయనేది
చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus